బలగం టీవీ, హైదరాబాద్:
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్కు హైకోర్టులో ఊరట లభించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది.
రేవంత్ రెడ్డి ఢిల్లీకి రూ.2500 కోట్లు పంపించారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇరువైపుల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తాజాగా ఈ కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.