బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 108 దరఖాస్తులు రాగ, ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శేషాద్రి, ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు పరికరాల అందజేత
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఇద్దరు దివ్యాంగులకు పరికరాలు అందజేశారు. ఎల్లారెడ్డి పేట మండలం గొల్లపల్లికి చెందిన దాసరి పవన్ అనే బాలుడు పుట్టుక తోనే నడవలేని స్థితిలో ఉన్నాడు. తనకు వీల్ చైర్ ఇప్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు విన్నవించాడు.
వేములవాడ లోని సాయి నగర్ కు చెందిన లేదేళ్ల రమేష్ తనకు మ్యానువల్ ట్రై సైకిల్ ఇప్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు విన్నవించాడు.
కలెక్టర్ ఆదేశాల మేరకు దాసరి పవన్ కు వీల్ చైర్, లేదేళ్ల రమేష్ కు మ్యానువల్ ట్రై సైకిల్, సంక కర్ర జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అందజేశారు. తమకు వీల్ చైర్, ట్రై సైకిల్ అందించి, ఆదుకున్న కలెక్టర్ కు వారు ఇద్దరు కృతజ్ఞతలు తెలిపారు.
