బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జిల్లాలో సన్న వడ్లు పండించిన రైతుల ధాన్యం సేకరించేందుకు రైస్ మిల్లర్లు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్బంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ జిల్లాలో సన్న వడ్లు పండించిన రైతులు తమ గ్రామంలోని కొనుగోలు కేంద్రాల్లో సరైన తేమశాతం తో విక్రయించాలని అన్నారు. జిల్లాలోని 18 రైస్ మిల్లులు సన్న వడ్లు సేకరించేందుకు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ వెల్లడించారు. సరైన ప్రమాణాలతో సన్నవడ్లు విక్రయించి రైతులు ప్రభుత్వమిచ్చే బోనస్ పొందాలని సూచించారు.