బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
-కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
విద్యార్థులు పక్కా ప్రణాళిక, లక్ష్యంతో ఉన్నతస్థానాలకు ఎదగాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు.
శనివారం పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అభినందించారు
గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు విష్ణుప్రియ 580, విగ్నారెడ్డి 573, వైష్ణవి 553, అలేఖ్య 551 మార్కులు సాధించారు. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సాయిహర్షిత్ 573, భానుతేజ 562, నవజీత్ 561, సుశృత 558, కావ్య 545, మైత్రి 531, భవ్య 535 మార్కులు సాధించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందించి జీవితంలో ఉన్నతశిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు. ఐఐటీ లక్ష్యంగా కష్టపడి చదువుతూ తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆయా విద్యాలయాల టీచర్లు తదితరులు పాల్గొన్నారు.