బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈనెల (జనవరి-2026)లో వివిధ రకాల వైకల్యాలు ఉన్న వారి కోసం ‘సదరం’ (SADAREM) వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత వైద్య నిపుణుల సూచనల మేరకు ఆయా విభాగాలకు నిర్దేశించిన తేదీలలో ఈ శిబిరాలు జరగనున్నాయి
శిబిరాల వివరాలు:
| క్రమసంఖ్య | క్యాంపు తేదీ | విభాగం |
| 1 | 21.01.2026 (బుధవారం) | మానసిక వైకల్యం – 13 |
| 2 | 21.01.2026 (బుధవారం) | వినికిడి లోపం – 13 |
| 3 | 22.01.2026 (గురువారం) | జనరల్ వైకల్యాలు – 06 |
| 4 | 28.01.2026 (బుధవారం) | ఆర్థోపెడిక్ (ఎముకల సంబంధిత) – 35 |
| 5 | 29.01.2026 (గురువారం) | కంటిచూపు సమస్యలు – 15 |
శిబిరానికి హాజరయ్యే దివ్యాంగులు వైద్య ధృవీకరణ పత్రాలు (Medical Documents) మరియు ఎక్స్-రే (X-Ray), UDID అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డు ఒరిజినల్ మరియు జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఫోన్ నెంబర్ వీటిని వెంట తీసుకుని అర్హులైన వారు పైన పేర్కొన్న తేదీలలో ఉదయం 09:00 గంటలకు ఆసుపత్రికి చేరుకోవాలని సూచించారు.
ఈ సమాచారాన్ని మండల అభివృద్ధి అధికారులు (MPDOs) మరియు సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని ప్రజలకు చేరవేసి అవగాహన కల్పించాలని కోరారు.
