బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో కొండి వర్షిత అనే విద్యార్థిని అద్భుత విజయం సాధించింది. చేనేత కుటుంబంలో జన్మించిన వర్షిత, ఎం.పీ.సీ గ్రూపులో వెయ్యికి గాను 976 మార్కులు సాధించి కళాశాల స్థాయిలో మూడవ స్థానంలో నిలిచింది.
నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ, వర్షిత తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచింది. బద్దెనపల్లి గ్రామస్తులు, మాజీ ఎంపీటీసీ సిలివేరి నరసయ్య, ఆవునూరి వెంకట రాములు, గుగ్గిళ్ళ రాము, శ్యామ్, సి.హెచ్ అనిల్, ఎడమల రాజశేఖర్ రెడ్డి తదితరులు వర్షితను ప్రత్యేకంగా అభినందించారు.