సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షులు మాట్ల మధు ఇంటింటి ప్రచారం
మంత్రి కేటీఆర్ను లక్షా మేజార్టీతో గెలిపించుకుందాం
సిరిసిల్ల న్యూస్: తంగళ్లపల్లి

రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం లోని తంగళ్లపల్లి మండలంలో సర్పంచ్ ల ఫోరం జిల్లా అధ్యక్షులు మాట్ల మధు బీఆర్ఎస్ పార్టీ తరుపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జిల్లెల్ల గ్రామ శాఖ అధ్యక్షులు అబ్బాడి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో సింగిల్ విండో చైర్మన్ కొడూరి భాస్కర్, పబ్బతి విజయేందర్ రెడ్డి, నర్ర సతీష్ రెడ్డి లు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రి కేటీఆర్కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు. లక్షా మేజార్టీ టార్గెట్ తో ముందుకు వెళ్లాలన్నారు. సిరిసిల్ల నియోజకవర్గాలన్ని అభివృద్ది బాటలో నడిపిస్తున్న నేత కేటీఆర్ అన్నారు. సర్పంచ్ల ఫోరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కేటీఆర్ కోసం ప్రచారం నిర్వహిస్తామన్నారు.
