ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్న సర్పంచ్ ఎం. రాజు
బలగం, టీవీ ఇల్లంతకుంట
ఇల్లంతకుంట మండలకేంద్రానికి చెందిన కట్ట పోచయ్య అనారోగ్యంతో మృతి చెందగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బాధిత కుటుంబానికి దహన సంస్కారాల నిమిత్తం 10,000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇల్లంతకుంట సర్పంచ్ ఎం.రాజు అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కక్కటి నెరవేరుస్తున్న సర్పంచ్ రాజును పలువురు అభినందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాకం సుమన్ మామిడి శ్రీనివాస్, అంతటి శ్రీకాంత్, కూనబోయిన రఘు తదితరులు పాల్గొన్నారు.
