బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
డిటిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ
స్కావెంజర్ల వేతనాలను వెంటనే విడుదల చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ కలెక్టర్ ని కోరింది. ప్రభుత్వము ఆదేశాల ప్రకారము 2024-25 విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లను నియమించుకోవడం జరిగింది. వారందరూ కూడా బడుగు, బలహీన, పేద వర్గాల వారే. వారికి పది నెలల వేతనము ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి ఉన్నది. ఆ మేరకు కొన్ని జిల్లాల్లో ఇప్పటివరకు పూర్తిగా, మరికొన్ని జిల్లాల్లో పాక్షికంగా6,7 నెలల వేతన చెల్లింపు జరిగింది. కానీ మన జిల్లాలో కేవలము 45 రోజుల వేతనం మాత్రమే చెల్లించడం చాలా బాధాకరం. ఈ విషయంగా డిటిఎఫ్ గతంలో నే కలెక్టర్ కి ప్రాతినిధ్యం చేసి ఉన్నది. కానీ ఏ విధమైన ఫలితం లేకపోవడంతో ఈరోజు మరొకసారి కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రామ్ రెడ్డి ని కలిసి స్కావెంజర్ల మిగతా వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరడం జరిగింది. ఆ మేరకు కలెక్టర్ కి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. కలెక్టర్ వెంటనే సహృదయతతో స్పందించి వారి వేతనాలను విడుదల చేయాలని డిటిఎఫ్ పక్షాన కోరుచున్నాము.
ఈ కార్యక్రమంలో అసలు డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు దొంతుల శ్రీహరి, ప్రధాన కార్యదర్శి అవురం సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి తడక సురేష్ తదితరులు పాల్గొన్నారు.