బలగం టీవీ, న్యూఢిల్లీ
- వీసాలు రద్దు, సింధూ జలాలు కట్..అట్టారి చెక్ పోస్ట్ మూసివేయాలని నిర్ణయించారన్నారు.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి ప్రధాని మోదీ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయాన్ని ప్రకటించింది. భద్రతపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం తర్వాత, విదేశాంగ కార్యదర్శి మిస్రి మాట్లాడుతూ, పాకిస్తాన్తో సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు చెప్పారు. అలాగే అట్టారి చెక్ పోస్ట్ మూసివేయాలని నిర్ణయించారన్నారు.
- పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి విశ్వసనీయంగా, తిరుగులేని విధంగా మద్దతు ఇవ్వడం మానుకునే వరకు 1960 నాటి సింధు జల ఒప్పందం తక్షణమే నిలిపివేయాలని నిర్ణయం.
- అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ తక్షణమే మూసివేయడం జరగుతుంది. చెల్లుబాటు అయ్యే అనుమతితో సరిహద్దు దాటిన వారు 2025 మే 1 లోపు ఆ మార్గం ద్వారా తిరిగి రావచ్చు.
- సార్క్ వీసా మినహాయింపు పథకం (SVES) వీసా కింద పాకిస్తానీ జాతీయులు భారతదేశానికి ప్రయాణించడానికి వీలులేదు.
- పాకిస్తానీ జాతీయులకు గతంలో జారీ చేసిన SVES వీసాలు రద్దు.
- SVES వీసా కింద ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఏ పాకిస్తానీ జాతీయుడైనా భారతదేశం విడిచి వెళ్ళడానికి 48 గంటల గడువు.
- న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లోని రక్షణ, సైనిక, నావికా, వైమానిక సలహాదారులను పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించారు. భారతదేశం విడిచి వెళ్ళడానికి ఒక వారం గడువు ఇస్తూ నిర్ణయం.
- ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ నుండి భారతదేశం తన రక్షణ, నావికాదళ, వైమానిక సలహాదారులను ఉపసంహరించుకుంది. సంబంధిత హై కమిషన్ల రద్దు.
- న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లోని రక్షణ, సైనిక, నావికా, వైమానిక సలహాదారులను పర్సనాలిటీ నాన్ గ్రాటాగా ప్రకటించారు. వారు భారతదేశం విడిచి వెళ్ళడానికి ఒక వారం సమయం ఇచ్చింది భారత ప్రభుత్వం.
- ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ నుండి భారతదేశం తన రక్షణ, నావికాదళ, వైమానిక సలహాదారులను వెనక్కి పిలిపిస్తుంది. ఈ పదవులను సంబంధిత హైకమిషన్లలో రద్దు చేసినట్లు సీసీఎస్ నిర్ణయించింది. సర్వీస్ అడ్వైజర్లకు చెందిన ఐదుగురు సహాయక సిబ్బందిని కూడా రెండు హైకమిషన్ల నుండి వెనక్కి పిలిపిస్తారు. 2025 మే 01 నాటికి మరింత తగ్గించడం ద్వారా మొత్తం హైకమిషన్ల సంఖ్య ప్రస్తుత 55 నుండి 30కి తగ్గుతుంది అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు.
ఇవి కేవలం ఆంక్షలు, కొన్ని నిర్ణయాలు మాత్రమే. అసలు సిసలు రివెంజ్ ఇకపై ఉంటుందన్న స్థాయిలో అంతకుముందు మాట్లాడారు రక్షణమంత్రి రాజనాథ్ సింగ్. ప్రపంచం ఆశ్చర్యపోయే సమాధానం ఇస్తామన్నారు రాజ్నాథ్. ఏ ఒక్కరినీ వదిలేది లేదని రక్షణ మంత్రి ఘాటుగా చెప్పారు.
ఈ సమావేశంలో హోంమంత్రిఅమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గోన్నారు.