మహిళలు, యువతులు ఎ సమస్య ఉన్న నిర్భయంగా పోలీస్ లను సంప్రదించండి.
జిల్లా వ్యాప్తంగా రద్దీగాల ప్రాంతంలో మఫ్టీలో షీ టీమ్ సిబ్బంది నిఘా.
ఎస్పి అఖిల్ మహాజన్
బలగంటివి,సిరిసిల్ల:
విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పి అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరంలో షీ టీమ్స్ బృందాలు ద్వారా కళాశాలలో, పాఠశాలల్లో, ర్యాగింగ్ ఇవిటీజింగ్ మొదలగు పై కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందనీ అన్నారు. షీ టీమ్ కు వచ్చిన ఫిర్యాదులలో అరు ఎఫ్ఐఅర్ లు ,రెండు పెట్టి కేసులు లు నమోదు చేయడం జరిగిందనీ అన్నారు. మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న పోకిరీల ను తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగిందనీ తెలిపారు.మహిళలు మరియు చిన్న పిల్లల రక్షణ విషయంలో జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. మహిళలపై జరుగు నేరాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని మహిళల భద్రత, ఆకతాయిల వేధింపుల నుండి మహిళల రక్షణ కొరకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. పోలీస్ శాఖ మహిళా భద్రతకు కొరకు జిల్లా వ్యాప్తంగా షి టీమ్స్ ఏర్పాటు చేసి ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థినీలు, యువతులు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటున్నదని తెలిపారు. మహిళలు ముఖ్యంగా సామాజిక మధ్యమాలైన ఫేస్ బుక్, వాట్స్ అప్, ఇన్ స్టాగ్రామ్ ల వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని , ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసే సమయంలో, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు .ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా సంప్రదించాలని, నేరుగా సంప్రదించలేని వారు షీ టీమ్ నంబర్ 87126 56425 లేదా 100 కు సమాచారం ఇవ్వాలనీ ,ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడతాయని తెలిపారు.