బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు రోడ్ల పైన ఇష్టం వచ్చినట్లు సైన్ బోర్డులు ఏర్పాటు చేసి వచ్చి పోయే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాహనదారులు ఆరోపించారు. వాహనదారుల తెలిపిన సమాచారం మేరకు ముస్తాబాద్ మండల కేంద్రంలో పలు వ్యాపారవేత్తలు పంచాయతీ లైసెన్స్ పొంది,పొందని వారు నిబంధనలకు విరుద్ధంగా రోడ్లమీద ఇనుప, కంకర, కట్టే మొదలగున వాటితో తయారుచేసిన సైన్ బోర్డులను ఆర్ అండ్ బి అధికారుల పర్మిషన్ లేకుండా వారి వారి షాపులు ముందు బొడ్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో వచ్చిపోయే వాహనదారులు వెళ్లేటప్పుడు ఆ బోర్డులు తగిలి ప్రాణాల తోపాటు గాయాలు అయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు.
ఈ విషయానికై పంచాయతీ కార్యదర్శి రమేష్ ను చరవాణి ద్వారా వివరణ కోరగా అలాంటి ఏమైనా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వారికి నోటీసు ఇచ్చి భారీ జరిమానా విధిస్తామని ఈవో తెలిపారు.