బలగం టివి: హైదరాబాద్:
తెలంగాణా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు శస్త్ర చికిత్స జరిగి హైదరాబాద్ యశోద హస్పిటల్ లో ఇన్ పేషెంట్గా ఉండగా పరామర్శించేందకు సిరిసిల్ల బీఆర్ఎస్ పట్టణధ్యక్షులు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో బారిగా బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్కు తరలివెళ్లారు. యశోద హస్పిటల్ లో మాజీ మంత్రి కేటీఆర్ను కలిసి మాట్లాడారు. సిరిసిల్ల నుంచి యశోదకు వచ్చిన సిరిసిల్ల వాసులను కలిసేందకు కేటీఆర్ ఆస్పత్రి బయటకు వచ్చి అభివాదం చేశారు. హైదరాబాద్ యశోద వద్ద ట్రాఫీక్ ఇబ్బందులు, యశోదకు వచ్చే రోగులకు ఇబ్బందులు అవుతున్నాయని.. రేపటి నుంచి అభిమానులు, పార్టీ శ్రేణులు రావద్దని విజ్ఞప్తి చేశారు.