బలగం టీవీ, రాజన్నసిరిసిల్ల:
భారత్-పాకిస్తాన్ యుద్ధంలో భారత్ గెలవాలని బోయినిపల్లి మండలంలోని వరదవెల్లి గ్రామంలో దత్తాత్రేయ ఆలయంలో బిజెపి నాయకులు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ: భారత్-పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మన భారతదేశ ఆర్మీకి ఎలాంటి అవాంఛనాలు జరగకుండా మరియు యుద్ధంలో విజయం సాధించాలని, దత్తాత్రేయస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సారంపల్లి రాజు, జనగం లక్ష్మణ్, ఆవుల లక్ష్మణ్, ఇల్లెందుల బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.