- మాజీ స్పీకర్ కు నివాళి అర్పించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్.
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీ పాదరావు జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖ ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించగా, కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్ర పటానికి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి రాందాస్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


