బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత రాజన్న సిరిసిల్ల గారి ఆధ్వర్యంలో పిసిపిఎన్డిటి జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రజిత మాట్లాడుతూ, జిల్లాలో పిసిపిఎన్డిటి నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే సంబంధిత స్కానింగ్ సెంటర్లను సీజ్ చేయడంతో పాటు, చట్ట ప్రకారం గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు మరియు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు ₹10,000 జరిమానా విధించబడుతుందని ఆమె స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో పిసిపిఎన్డిటి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్, ఎన్జీవో ప్రెసిడెంట్ చింతూరు భాస్కర్, లీగల్ అడ్వైజర్ శాంతి శుక్ల, ఎన్జీవో కమిటీ సభ్యురాలు ఝాన్సీ లక్ష్మి, డిప్యూటీ డెమో రాజ్ కుమార్, హెచ్ ఇ బాలయ్య, డిఇఓ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
