బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాష్ట్ర ర్యాంకులు సాధించిన మైనార్టీ గురుకుల విద్యార్థులను అభినందించిన ప్రభుత్వ విప్
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనీ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో వేములవాడ లోని మైనార్టీ గురుకుల పాఠశాల కళాశాలకు చెందిన విద్యార్థులు హేమంత్ వోకేషనల్ ఏంఎల్టీ మొదటి సంవత్సరంలో 496 మార్కులతో రాష్ట్ర మొదటి ర్యాంకు ఆదిల్ షరీఫ్ ఎల్ఎండిటి లో 500 కు గాను 483 తో రాష్ట్ర రెండవ ర్యాంకు, ద్వితీయ సంవత్సరంలో 900 మార్కులకు పైగా సాధించిన 16 మంది విద్యార్థులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో మొదటి, రెండవ ర్యాంకులు సాధించడం అభినందనీయమన్నారు. ప్రజా ప్రభుత్వంలో విద్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం, ఐటిఐలు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు.
గత పది సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా గురుకులాల్లో డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలను పెంచడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థులు రానున్న రోజుల్లో తమపై చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి తల్లిదండ్రులకు నమ్మకాన్ని వమ్ము చేయకూడదని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, లెక్చరర్స్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.