బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రజతోత్సవ సభను విజయవంతం చేసిన వేములవాడ నియోజకవర్గ పార్టీ శ్రేణులకు నా కృతజ్ఞతలు: -నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు
తెలంగాణ రాష్ట్రంలోనే కనీవినీ ఎరగని రీతిలో వరంగల్ ఎల్కతుర్తి ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం జరిగిన బిఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ వేడుకలకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి రజతోత్సవ సభను విజయవంతం చేసిన ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, తెలంగాణ ఉద్యమకారులకు, పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజే ఈ సభతో బిఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్న విశ్వాసం, అభిమానం వచ్చిన జన సందోహాన్ని చూస్తుంటేనే తెలుస్తుంది. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల అభివృద్ధి పాలన, చేపట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ప్రజల్లో ఎప్పటికీ చిరస్థాయిలో నిలిచిపోయాయి అనేదానికి వచ్చిన జన సందోహం కూడా నిదర్శనం. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తూ ముందుకు వెళ్లేందుకు మీ ఆదరాభిమానాలు ఇలానే ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపారు.