బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
నిర్లక్ష్యంగా వ్యహరించి ఒక మృతి కారణం అయిన స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుడికి ఒక సంవత్సరము కఠిన కారాగార జైలు శిక్షతో పాటు 2000/- వేయిల రూపాయల జరిమానా సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ సోమవారం తీర్పు వెల్లడించినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు.
ఈ మేరకు సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతు….
విద్యానగర్ లో గల స్విమ్మింగ్ పూల్ లో తేది : 21-03-2015 రోజున సాయంత్రం 06:00 గంటల సమయంలో పిర్యాది మెరుగు మురళీధర్ s/o నారాయణ,వయస్సు:58 సం లు r/o విద్యానగర్ సిరిసిల్ల అనే వ్యక్తి కొడుకు మెరుగు శివ s/o మురళీధర్ వయస్సు: 23 సం లు r/o విద్యానగర్ సిరిసిల్ల అనునతడు విద్యానగర్ లో గల స్విమ్మింగ్ పూల్ లో ఈత నేర్చుకోవడానికి వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో దిగి లోతులోకి వెళ్లి ఈత రాక నీటిలో మునిగి చనిపోయినడని స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుడైన చల్ల రవి s/o సతయ్య, 42 సం లు, మున్నురుకపు, r/o చిన్నబోనల, సిరిసిల్ల అనునతని నిర్లక్ష్యంగా వ్యవహరించి సరియైన పర్యవేక్షణ లేనందున నీటిలో మునిగి చనిపోయినడని పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిర్వాహకుడైన చల్ల రవి s/o సతయ్య, 42 సం లు, మున్నురుకపు, r/o చిన్నబోనల, సిరిసిల్ల అనునతడిని బాలకిషన్ ఎస్ ఐ అరెస్టు చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. విచారణ అనంతరం విచారణ అధికారి బాలకిషన్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా CMS ఎస్. ఐ.రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ పదమూడు (13) మంది సాక్షులను ప్రవేశపెట్టినారు. ప్రాసిక్యుశన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెలుముల సందీప్ వాదించగా కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఏ.ప్రవీణ్, నేరస్తుడు అయిన చల్ల రవి s/o సతయ్య కు ఒక సంవత్సరం జైలు శిక్ష తో పాటు రెండు వేయిల రూపాయల జరిమానా,మరియు పిర్యదికి నష్ట పరిహారంగ యాబై వేల రూపాయలు చెల్లించాలని తీర్పు వేల్లడించినట్లు సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.