బలగం టీవీ, హైదరాబాద్:
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘కేసీఆర్ తెలంగాణ జాతిపిత’ పాటను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. బంజారాహిల్స్లోని నందినగర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పాటను విడుదల చేశారు.
పాట రచయిత మానుకోట ప్రసాద్, గాయకుడు సాకేత్, సంగీత దర్శకుడు మిథున్, డీఓపీ అజయ్ కొడం, సహకారం అందించిన మద్దెల సందీప్లను కేటీఆర్, జగదీష్ రెడ్డి అభినందించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దయాకర్ రెడ్డి, నేవూరి ధర్మేందర్ రెడ్డి, పల్లా ప్రవీణ్ రెడ్డి, వల్లమల్ల కృష్ణ, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల సతీష్, కల్లెట్లపల్లి శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ పాట కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన విజయాలను, ఆయనను తెలంగాణ జాతిపితగా కీర్తిస్తూ రూపొందించారు.