బలగం టీవి, వేములవాడ:
తెలంగాణ ప్రభుత్వం రాష్టంలో కుల గణన చేయడం ద్వార తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ అన్నారు. గురువారం వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా దేశంలో ఉన్న అసమానతలు తొలగించి కుల గణన చేయాలని సంకల్పించారని,దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేయడం జరపడం జరిగిందని అన్నారు.కుల గణన ను అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని,దానిని చట్టంగా మార్చి షెడ్యూల్ నైన్ లో చేర్చాలని అన్నారు.రాహులు గాంధీ పోరాటం రేవంత్ రెడ్డి ఆలోచన దేశా వ్యాప్తంగా కుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తున్నామని అన్నారు.వెనుకబడిన వర్గాల లెక్క తేల్చి వారికి ఉద్యోగ, విద్య రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించాలని భారత్ జూడో యాత్ర సందర్భంగారాహుల్ గాంధీ సంకల్పించారని అన్నారు.బిసి బిడ్డగా తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు పొన్నం ప్రభాకర్ ప్రవేశా పెడితే బలపరిచే అవకాశం నాకు లభించిందని అన్నారు.
ఎన్ని అడ్డంకులు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కూల గణన నిర్వహించి, బీసీ ల సంఖ్య 56.36 శాతంగా లెక్క తేల్చారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి షెడ్యూల్ నైన్ లో చేర్చాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగిందని,జంతర్ మంతర్ వద్ద ధర్నా లో వివిధ పార్టీల ఎంపీలు వచ్చి మద్దతు తెలిపారని అన్నారు.
దేశంలో కూల గణనపై జరుగుతున్న ఒత్తిడి తట్టుకోలేక బిజెపి ప్రభుత్వం దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు.
బిఆర్ఎస్ అనాడు కుల గణన చెసి వారి రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారని అన్నారు.బీజేపీ బిఆర్ఏస్ పార్టీలు తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన పై తపుడు ఆరోపణలు చేశారని అన్నారు.ప్రతి దాన్ని రాజకీయ కోణంలో చూడటం మానుకోవాలని,
రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు పోతామని అన్నారు.