బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జిల్లాలో త్వరగా పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించేందుకు టిజిఐపాస్ కింద వచ్చిన దరఖాస్తులను నిర్దేశిత సమయంలో జారీ చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంభందిత అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించి పరిశ్రమల స్థాపన, టి.ఎస్.ఐ పాస్, టి – ప్రైడ్ పై సంభందిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్బంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ జిల్లాలో టీజి ఐపాస్ విధానం అమలవుతున్న తీరును ఆరా తీశారు. జిల్లాలో పరిశ్రమల అనుమతుల దరఖాస్తులను సకాలంలో జారీ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపనకు సంబంధించి వచ్చిన 27 ప్రతిపాదనలలో 21 ప్రతిపాదనలకు వివిధ శాఖల వారు జారీ చేసిన అనుమతులను సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న 6 ప్రతిపాదనలు సైతం తక్షణమే సమీక్షించి వెంటనే అనుమతులు జారీ చేయాలని , జారీ చేసిన అనుమతులు ఆన్ లైన్ లో ప్రతిభంబించేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలో టీ – ప్రైడ్ పథకం క్రింద మంజూరు చేసిన 42 యూనిట్లు ఫైల్స్ సంపూర్ణ వివరాలు అందించాలని అన్నారు. టీ ప్రేడ్ క్రింద అందించిన ట్రాక్టర్లను గతంలో అక్రమ ఇసుక రవాణాకు వాడుతున్నారని, భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూడాలని అన్నారు.
పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అక్రమ ఇసుక రవాణా కేసులు ఏ ట్రాక్టర్ల పైన ఉన్నాయ్, వాటికి ట్రీ ప్రైడ్ కింద ఏదైనా సబ్సిడీ ప్రతిపాదన చేశామా పరిశీలించి నివేదిక అందించాలని అన్నారు.
ఈ సమావేశంలో జి.ఎం. పరిశ్రమల శాఖ టి.హన్మంత రావు, టిజిఐఐసి జోనల్ మేనేజర్ మహేశ్వర్, ట్రాన్స్పోర్ట్ అధికారి లక్ష్మణ్, ఈడి ఎస్సీ కార్పొరేషన్ డి.స్వప్న, ఇతర శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.