బలగం టీవీ, రాజన్నసిరిసిల్ల:
-బండి సంజయ్ కేంద్రం నుండి నిధులు తీసుకురావాలి..
-ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సిఎం రేవంత్ రెడ్డి దుబ్బారా ఖర్చు చేయకుండా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాడని,ఆడంబరాలకు పోకుండా ప్రతినిత్యం 18 గంటల కష్టపడుతూ,
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు పోతున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కెటిఆర్ బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్తే దానిని బిజెపి బిఆర్ఎస్ వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని,కెటిఆర్, బండి సంజయ్ మాటలు కోటలు దాటుతున్నాయని అన్నారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులను ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే గత అసెంబ్లీ సమావేశంలో సి ఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు వారు కట్ చేసి ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ లు పెడితే బిఆర్ఎస్, బీజేపీ వారు వాట్స్ అప్ యూనివర్సిటీ లు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.గతంలో బిఆర్ఎస్ నాయకులు ధనిక రాష్ట్రం అంటే బిజేపి నాయకులు ఎందుకు ఖండించలేదు అని అన్నారు.
కాళేశ్వరం పేరిట తెలంగాణ సంపదను బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారని అన్నారు.రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మార్గాలు ప్రజా ప్రభుత్వంలో చేపడుతుంటే బీఆర్ఎస్ నాయకులు అడ్డుకట్ట వేస్తున్నారని అన్నారు.కంచ గచ్చి బౌలి భూమల విషయంలో కూడా ప్రభుత్వం పై ఆరోపణలు చేశారని,కేంద్ర మంత్రి కిసాన్ రెడ్డి కంచ గచ్చీబౌలి భూముల విషయం పై సోషల్ మీడియా లో పెట్టిన పోస్టాలను ఎందుకు తీసివేశారని అన్నారు.
విభజన హామీలను ఏమయ్యాయని,బీజేపీ అసమర్థత కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందని అన్నారు.
రోడ్డు వేసామని గొప్పలు చెప్తున్నారు, మీరూ రోడ్డు వేసి టోల్ టాక్సీ వేసి డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు.బిసి కుల గణన మేము చేస్తే,కుల సర్వే అంటున్నారని,వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారి విజ్ఞత కే వదిలేస్తున్నామని అన్నారు.
రాహుల్ గాంధీ చెప్పినట్లు గా దేశమంతా కుల గణన చేసి తీరాల్సిందే అని,రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే, ధర్నా చేస్తే 50 మంది ఎంపీలు, 15 రాష్ట్రాల బీసీ సంఘం నేతలు పాల్గొనడం జరిగిందని అన్నారు.
ఎస్సి వర్గీకరణ అమలు చేయడం జరుగుతుందని,
కవిత బిసి లకు నాయకత్వం వహించాలని అవసరం లేదని అన్నారు.గత ప్రభుత్వం హయంలో ఏ రంగానికి కూడా పాలసీ లేదని,ప్రజా ప్రభుత్వంలో అన్ని రంగాలకు పాలసీ లు చేస్తున్నామని అన్నారు.
మీరు మీ ప్రభుత్వ హయంలో హెలికాప్టర్ వాడితే తప్పులేదు కానీ, మా మంత్రులు వాడితే తప్పా అని,ఆనాడు మీరు, మీ నాన్న హెలికాప్టర్ ఎక్కి కరీంనగర్ సిరిసిల్లలో దిగవచ్చు కానీ మా మంత్రులు వాడితే మీకు నచ్చడం లేదా అని ప్రశ్నించారు.
బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే అని,ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి పెరిట ముందుకు పోతే చూస్తూ ఓర్వలేక పోతున్నారని అన్నారు.
బండి సంజయ్ ఎల్లారెడ్డి పేటలో వారు కేంద్ర మంత్రిగా మాట్లాడినా మాటలు ఖండిస్తున్నామని, బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలని అన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేస్తున్నామని అన్నారు.
రైతులు తేడాను గమనించాలని,రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అన్నారు.సి ఎం రేవంత్ రెడ్డి రైతును రాజుగా చేయాలనీ ముందుకు పోతున్నామనిఅన్నారు.
వర్షానికి తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని,సన్నం వడ్లను కూడా కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు.తూకం వేసిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, కలెక్టర్ నాయకత్వంలో వడ్ల కొనుగోలు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్య నారాయణ గౌడ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.