బలగం టీవీ, వేములవాడ
రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రిన్సిపల్ జడ్జి శ్రీమతి పి. నీరజ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి, స్వామి వారిని దర్శించుకున్నారు. వేములవాడ సబ్ కోర్టు జడ్జి శ్రీ అజయ్, జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జ్యోతి కిరణ్మయి, ఆలయ ఈఓ కె. వినోద్ పూల మొక్కలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు.
ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు జిల్లా జడ్జి కి పూర్ణ కుంభ స్వాగతం చేశారు. స్వామి వారి దర్శనం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి, స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.
