బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
– దేశం ముందు మతం గొప్పది కాదు
- మాజీ మండల కో-ఆఫ్షన్ మెంబర్ మహ్మద్ ఆజ్జూ
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని కాల్చి చంపడం హేయమైన చర్య అని, నరమేదానికి పాల్పడిన ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవాలని బోయినిపల్లి మండల మాజీ కో-ఆఫ్షన్ మెంబర్ మహ్మద్ ఆజ్జూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పహల్గామ్ ఉగ్ర దాడిలో మరణించిన వారందరికీ అశృనివాళులు అర్పిస్తున్నాం అని అన్నారు.
ఈ సందర్భంగా ఆజ్జు మాట్లాడుతూ: దేశంలోని ముస్లిం సమాజమంతా దేశభద్రతకు మద్దతుగా నిలుస్తుందన్నారు. దేశముందు మతం గోప్ప కాదని, ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో అణచివేయాలి అని అన్నారు.