బలగం టీవీ, హైదరాబాద్:
- నెర్రెలు బాసిన సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు..
- నాడు సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకించిన కాంగ్రెస్
- నాడు అనుమతులు రాకుండా కోర్టుల్లో కేసులు..
- నేడు గోదావరి జలాల వద్ద ఫోటోలకు ఫోజులిస్తున్న కాంగ్రెస్ మంత్రులు, నాయకులు
- తిట్టడం తప్ప.. కట్టడం రాని కాంగ్రెస్ కు, కేసిఆర్ గొప్పతనం ఇప్పటికైనా అర్థం కావాలి
- ఈ ప్రాజెక్టుతో ఒక్క ఎకరాకు నీరు రాదు అన్నోళ్ళు, ఏం సమాధానం చెబుతారు?
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల సాగు, తాగునీటి కష్టాలకు సీతారామ ఒక శాశ్వత పరిష్కార మార్గం.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి హక్కులను కాపాడలేని కాంగ్రెస్ చేతగానితనం వల్ల సాగర్ ఆయకట్టుకు కరువు వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల రోజుకు పదివేల క్యూసెక్కుల కృష్ణ జలాలను ఆంధ్ర తరలించుకుపోతున్న పరిస్థితి అని ఈ తరుణంలో రైతులను ఆదుకునేందుకు ఏకైక మార్గం గోదావరి జలాలను ఒడిసి పట్టి, ఎత్తిపోయడం దీన్ని ముందే అంచనా వేసిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని కేంద్రం కొర్రీలను, కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఛేదించి వడివడిగా (90%)శాతం పనులు పూర్తి చేశారని ఇదే కాంగ్రెస్ నేతలు నాడు సీతారామ ప్రాజెక్టే వృధా అన్నరని అనుమతులు రాకుండా కోర్టుల్లో కేసులు వేయించారని అన్నారు. కేసీఆర్ పట్టుబట్టి న్యాయపరమైన చిక్కులు తొలగించి, అత్యంత క్లిష్టమైన అటవీ_పర్యావరణ అనుమతులు సాధించి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయించారని ఆ ఫలితమే నేడు కరువు కోరల్లో చిక్కుకున్న ఖమ్మం జిల్లా రైతులకు వరంగా మారిందని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి సిద్ధంగా ఉంచిన సీతారామ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తూ అక్కడ ఫోటోలకు మంత్రులు, నాయకులు ఫోజులు ఇస్తున్నారంటే అందుకు కేసిఆర్ ఏ కారణమని అన్నారు.
ప్రత్యక్షంగా ఆరు లక్షల ఎనబై వేల ఎకరాలకు, పరోక్షంగా పది లక్షల ఎకరాలకు సీతారామ ద్వారా గోదావరి జలాలు సీతారామా ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని నాడు ప్రతిపక్షంలో ఉండి ఇదే కాంగ్రెస్ నాయకులు విమర్శించారని 2023 డిసెంబర్-7న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరింది. అదికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు మీద విషం చిమ్మారని వృథా ప్రాజెక్టు అన్నారని ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారని డిపిఆర్ లేదన్నారని ఒకే ఒక్కసారి మంత్రులు బృందం పర్యటించి, 2024 ఆగస్టు-15వ తేదీన మూడు పంపు హౌసులను ఏకకాలం స్విచ్ ఆన్ చేసి ప్రాజెక్టును ప్రారంభించారని కేసీఆర్ మొక్కనోని దీక్షముందు కాంగ్రెస్ నేతల ఆరోపణలు పటాపంచలు అయిపోయారని బీఆరె్ఎస్ ప్రభుత్వ కష్టం, నేడు సగౌరవంగా రైతుల ముంగిట నిలబడిందని 60 ఏండ్ల కాంగ్రెస్, టిడిపి పాలనకు, పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనకు తేడాను సుస్ఫష్టం చేసింది అని అన్నారు.
అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే పదిలక్షల ఎకరాలకు నీళ్లించే ప్రాజెక్టును ప్రారంభించారంటే… దాని వెనుక బిఆర్ఎస్ ప్రభుత్వ కృషి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చని ఓట్లు, సీట్లు, అధికారం శాశ్వతం కాదని, మనం చేసిన అబివృద్దే శాశ్వతమని నమ్మే నాయకుడు కేసీఆర్ అని,అలా నమ్మి నిర్మించినవే కాళేశ్వరం, సీతరామా ఎత్తిపోతల ప్రాజెక్టులని ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు రైతాంగానికి జీవనాడులై బాసిళ్లుతాయి. కేసీఆర్ కృషి దశదిశలా చాటుతాయని అన్నారు.