బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
-ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
జమ్ము కశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి బాధాకరం అని,ఉగ్ర దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ అంబేద్కర్ చౌరస్తా నుండి మహంకాళి చౌరస్తా వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అది శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాశ్మీర్ లోని ఉగ్రదాడిలో మరణించిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నని, దాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు మనోధార్యాన్ని కల్పించాలని రాజరాజేశ్వర స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. ఉగ్ర దాడులతో చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నయని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశం కూడా మనగడ సాధించ లేదన్నారు. ఈ ఘటనను హేయమైన చర్యగా అభివర్ణించిన ఇటువంటి కిరాతక చర్యలు భారత ప్రజల సమైక్యతను,ధైర్యాన్ని ఎన్నటికీ దెబ్బతీయలేవుఅని,ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాతి మొత్తం ఏకం కావలసిన సమయం ఆసన్నమైందని అన్నారు.
ఈ దాడి చేసిన ఉగ్రవాదులను గుర్తించి వారిని వారి సంస్థను మట్టుబెట్టాలని పేర్కొన్నారు. ఈ దాడికి బాధ్యత వహిస్తున్న ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కేంద్రం ఎటువంటి సంకోచం లేకుండా కఠినంగా వ్యవహరించాలనీ కోరుతు,మృతుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.