మొదటి విడత పోలింగ్ కు కట్టుదిట్టమైన భద్రత..

0
60
  • జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

గ్రామ పంచాయతీ మొదటి విడత పోలింగ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు జరుగు మండలాలలో ఎన్నికలు పురస్కరించుకొని బందోబస్త్ కు వచ్చిన పోలీస్ సిబ్బందికి ఆయా పోలీస్ స్టేషన్లలో ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు.

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలింగ్ జరుగు సమయంలో,ఓట్ల లెక్కింపు సమయంలో పోలీస్ అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని,ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో ప్రతి పోలీస్ అధికారి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సమయంలో రూట్ మొబైల్ పోలీస్ అధికారులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ, పోలింగ్ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో గుంపులుగా లేకుండా జాగ్రత్తపడాలన్నారు. ఏదైన సమస్య తలెత్తినప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు.

ఎస్పీ వెంట పోలీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here