బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
- జిల్లా విద్యాధికారి Ch.V.S. జనార్దన్ రావు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో TOSS (తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ) పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్/మే 2025 విద్యా సంవత్సరానికి గాను, ఏప్రిల్ 22, 2025న ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాధికారి Ch.V.S. జనార్దన్ రావు తెలిపారు.
ఉదయం జరిగిన పరీక్షలకు జిల్లాలోని నాలుగు పరీక్షా కేంద్రాలలో మొత్తం 954 మంది విద్యార్థులకు గాను 90.67% హాజరు నమోదైంది. 865 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 89 మంది గైర్హాజరయ్యారు.
మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు రెండు పరీక్షా కేంద్రాలలో 114 మంది విద్యార్థులకు గాను 89.47% హాజరు నమోదైంది. 102 మంది విద్యార్థులు హాజరు కాగా, 12 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
మూడవ రోజు పరీక్షలు కూడా సజావుగా ముగిశాయని జిల్లా విద్యాధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.