రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ బీజేపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించన అనంతరం టికెట్ రద్దు చేసి చెన్నమనేని వికాస్ రావుకు కేటాయించడంతో భంగపడ్డ కరీంనగర్ జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ బీజేపికి రాజీనామీ చేశారు. తన అనుచర వర్గంతో చర్చించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకోని హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. తన సొంత ఇంటికి తాను వచ్చినట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ గెలుపుకోసం పని చేస్తానని, వేములవాడ నియోజకవర్గ అభివృద్దిలో తాను భాగమవుతానని తుల ఉమ పేర్కొన్నారు.