బలగం టీవీ,
ఒక వ్యక్తికి చెందిన 88 రోజుల అర్ధ వేతన సెలవుల పెండింగ్ బిల్లు సిద్ధం చేయడానికి రూ.20,000/- లంచం డిమాండ్ చేసి, స్వీకరిస్తుండగా ఏసీబీ వారు వీరిని అరెస్టు చేశారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ డివిజన్-6 నీటిపారుదల కార్యాలయంలో సూపరింటెండెంట్ దుంపల శ్రీధర్ బాబు మరియు సీనియర్ అసిస్టెంట్ మహాదేవుని సురేష్ లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు.
ప్రజలు ఏ ప్రభుత్వ సేవకుడు లంచం అడిగినా వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని లేదా వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (Telangana ACB), లేదా ఎక్స్ (@TelanganaACB) ద్వారా సంప్రదించాలని ఏసీబీ అధికారులు కోరారు.