బలగంటివి, ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ ప్రైమరీ విద్యార్థులు శనివారం విహార యాత్రకు 300 మంది తో కలిసి తరలివెళ్ళినట్లు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ లతీఫ్ , ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ సంతోష్ లు తెలిపారు.
విహారయాత్రలో భాగంగా ప్రైమరీ విద్యార్థులను సిరిసిల్ల ఇందిరాపార్క్ కు తీసుకువెళ్ళడం జరిగిందని దీని విద్యార్థులకు వినోదం విజ్ఞానం పెరుగుతుందని వారు తెలిపారు. విద్యార్థులు శనివారం ఇందిరా పార్క్ లో 17 మంది ఉపాధ్యాయులు 10 మంది బోధనేతర సిబ్బంది మధ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు పుల్ ఎంజాయ్ చేశారని ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ సంతోష్ తెలిపారు,