ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా ముందుంట
- సర్పంచ్ అభ్యర్థి ఉయ్యాల శ్రీనివాస్
బలగం టీవీ, బోయినిపల్లి:
తనను తడగొండ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాతానని సర్పంచ్ అభ్యర్థి ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ ఓటర్లకు తెలిపారు. ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ ప్రజల మద్దతుతో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఈనెల 14న జరిగే ఎన్నికల్లో తన గుర్తు ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజా శ్రేయస్సు ధ్యేయంగా ముందుకు వస్తున్నారని, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా ముందుంటు పరిష్కరిస్తానని తెలిపారు. ఎవరిని మాయ మాటలు చెప్పిన నమ్మవద్దని, మోసపోతే గ్రామం అభివృద్ధి వెనుక పడుతుందని,నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే గ్రామ సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.
