బలగం టీవీ, బోయినిపల్లి:
బోయినిపల్లి మండల కేంద్రంలో మరియు కొదురుపాక గ్రామంలో కాకుండా పల్లె దవాఖానాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సెంటర్ నిర్మిస్తే బాగుండు?
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటుచేసిన పల్లే దావఖానాలు అలంకారప్రాయంగా మారుతున్నాయి. గ్రామీణ వైద్యాన్ని బలోపేతం చేస్తూ గత ప్రభుత్వం పల్లె దవఖానాలు నిర్మించింది.బోయినిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిదిలో రెండు సబ్ సెంటర్లు,కొదురుపాక ఆరోగ్య కేంద్ర పరిధిలో రెండు సబ్ సెంటర్లు, విలాసాగర్ ఆరోగ్య కేంద్ర పరిధిలో మూడు సబ్ సెంటర్లు ఉన్నాయి.ఇవి మొత్తం అద్దె భవనంలో కొనసాగుతున్నాయి.ప్రస్తుతం నూతనంగా గత ప్రభుత్వం బోయినిపల్లి మండల కేంద్రంతో పాటు వరదవెల్లి, కొదురుపాక గ్రామలలో మొత్తం మూడు పల్లె దవాఖానాలను నిర్మించింది.భవన నిర్మాణ పనులు పూర్తయిన దవాఖాన తలుపులు ఏండ్లు గడుస్తున్నా కూడా ఇప్పటికీ తెరుచుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.దీనితో పాటు దవఖాన చుట్టూ పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయని,ఇప్పటికైనా పల్లె దవాఖానాలను త్వరగతిన ప్రారంభించి, గ్రామీణ ప్రజలకు వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు.
బోయినిపల్లి మండల కేంద్రంలో మరియు కొదురుపాక గ్రామంలో ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీని పల్లె దవాఖానాలు ఈ గ్రామాలలో కాకుండా ఇతర వేరే గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంచి సెంటర్ చూసుకొని నిర్మిస్తే బాగుండునని,గ్రామాల ప్రజలు హాసహనానికి గురవుతున్నారు. పల్లె దవఖాన భవనాలు పూర్తి అయిన కూడా విద్యుత్ సమస్య, నీటి సమస్యతో పాటు చిన్న చిన్న సమస్యలు ఇప్పటివరకు కూడా పూర్తి కాలేదు. ఇప్పటికైనా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మరియు ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొని వెంటనే వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు.