బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
- టీజీవో అధ్యక్షులు సమర్సన్ డోర్స్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి
- మహిళా దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని టీజీవో అధ్యక్షులు సమర్సన్ మరియు డోర్స్ (డిస్టిక్ ఆఫీసర్స్ ఆఫ్ రాజన్న సిరిసిల్ల) జిల్లా పశువైద్యాధికారి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.
మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని ఆడిటోరియం లో మహిళలకి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ మహిళలకి సమానమైన హక్కులతోపాటు ప్రత్యేకమైన చట్టాలను కూడా ప్రభుత్వం కల్పిస్తుందని వివరించారు. గృహ హింస నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణ చట్టం, నిర్భయ చట్టం, వంటి చట్టాల ద్వారా మహిళలు వారి యొక్క హింసల్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎన్నో శాఖల ద్వారా వారికి సహకారం అందిస్తుందని తెలియజేయడం జరిగింది. మహిళలు ఏ సందర్భంలోనైనా లైంగిక,మానసిక,శారీరక,ఆర్థిక వేధింపులను ఎదుర్కొంటున్నట్లయితే వారికి 181 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వైద్య, న్యాయం, పోలీస్, కౌన్సిలింగ్, షెల్టర్ వంటి సహాయాల్ని అందించడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు ప్రభుత్వం ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు, మహిళలు ఆర్థికంగా ముందున్నడంవల్ల కుటుంబం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నిర్మల దేవి, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రోజా, దేవిక సఖి ఇన్చార్జి విజయ, అనుపురం మహిళలు పాల్గొనడం జరిగింది. అలాగే ఈ రోజు సఖి ఆధ్వర్యంలో నర్సింగ్ కాలేజీ కేంద్రంలోనూ మహిళలకు విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. అనంతరం మహిళా అధికారులకు సిబ్బందికి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి సిరిసిల్ల ఆర్డీవో రాధా బాయ్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మిషన్ భగీరథ ఈఈ జానకి, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, డిఆర్ డి ఓ శేషాద్రి, మహిళా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
