బలగం టీవీ, రాజన్నసిరిసిల్ల:
అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థిని-విద్యార్థులను సన్మానించిన
మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని ముందుకు సాగాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.
బోయినిపల్లి మండలం రత్నం పేట గ్రామానికి చెందిన విద్యార్ధిని-విద్యార్థులు కల్లేపల్లి చైతన్య ఇంటర్ (984/1000), ఎదురగట్ల శ్రీజ ఇంటర్ ఫస్ట్ ఇయర్ (420/470), ఏడిద సింధుజా ఇంటర్ ఫస్ట్ ఇయర్ (467/470), పదో తరగతిలో కల్లేపెల్లి శరణ్య (563/600), గర్వందుల ఐశ్వర్య (549/600), కనపర్తి భావన (531/600), కందారపు సాయి శృతి (528/600), కందారపు మన్మిత (520/600), గురిజాల రుచిత (515/600), కేసవేణి లోకేష్ (547/600), ర్యాగల్ల శశాంక్ (535/600), కందారపు రాంచరణ్ (504/600) మార్కులు సాధించిన విద్యార్థిని-విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. శాలువాతో సత్కారించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్బంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ: విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, వివిధ రంగాలలో రాణించాలనే లక్ష్యం పెట్టుకోవాలి. విద్య ద్వారా మనం నైపుణ్యాలు, జ్ఞానం మరియు వివిధ రంగాల గురించి అవగాహన పెంచుకోవచ్చు. ఉన్నత చదువులు మనకు మంచి భవిష్యత్తును అందిస్తాయని అన్నారు. అనంతరం విద్యార్థిని-విద్యార్థులతో కలసి మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల కో-ఆఫ్షన్ సభ్యులు మహ్మద్ ఆజ్జూ, బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ బత్తిని కమల్ గౌడ్, కళ్ళేపెల్లి కృష్ణమూర్తి, మండల బిఆర్ఎస్ బిసి సెల్ అధ్యక్షులు గురిజాల కోటి,గొండ సుధాకర్,ర్యాగల్ల బాలకిషన్,గురిజాల శ్రీనివాస్,ర్యాగల్ల తిరుపతి,కందరపు వెంకటేష్,కన్నం అక్షయ్,బోరుగని లింగరావు తదితరులు ఉన్నారు.